మద్యం సేవించి వాహనాలు నడపరాదు:ఎఎస్ఐ అంజీలయ్య.
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎఎస్ ఐ అంజీలయ్య ఆధ్వర్యంలో అదివారం సాయంత్రం నారాయణపేట పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ లు నిర్వహించడం జరిగింది పలు వాహనదారులకు బ్రీత్ అనలైజర్ తో డ్రంకన్ కండిషన్ తనిఖీ చేసి 04 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు.ఈ సందర్భంగా శిక్షణ ఎఎస్ ఐ ఆంజిలయ్య మాట్లాడుతూ. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని మద్యం సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. కావున వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని వాహనదారులకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జరిమానా తో పాటు జైల్ శిక్ష విధించడం జరుగుతుందని, మద్యం సేవించిన కేసులు పునరావృత్తం అయితే వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
