పెద్ద తుప్పర మల్లన్న కళ్యాణ మహోత్సవంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్.
నమస్తే భారత్, రాజేంద్రనగర్, ఏప్రిల్ 20. పెద్ద తుప్పర మల్లన్న కళ్యాణ మహోత్సవంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసిందని శంషాబాద్ మండల మాజీ ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద తుప్పర గ్రామంలో ఆదివారం మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో మాజీ ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఘనంగా సన్మానించారు. తదనంతరం మాజీ ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏటా పెద్ద తుప్పర గ్రామంలో మల్లన్న కళ్యాణ మహోత్సవ వేడుకలు ఎంత వైభవంగాజరుగుతుంటాయని గ్రామస్తులందరూ భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారని వారన్నారు, మండల్ పార్టీ అధ్యక్షుడు మంచర్ల మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి గౌస్ పాషా, గ్రామ అధ్యక్షుడు మైల విద్యాచరణ్ , సెగు అశోక్ , బిక్యా నాయక్ , మాజీ-వార్డు సభ్యుడు టి దాసు , ఉపాధ్యక్షుడు జయం రాజు, అంకం రాములు ,అంకం కుమార్ , అంకం రవి , గోవింద్ , అంకం ప్రవీణ్, గ్రామస్థులు నాయకులు తధితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

