రాజీవ్ యువవికాసం దరఖాస్తుల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలి
అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్.
రాజీవ్ యువవికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు
తేదీ, ఏప్రిల్ 21, 2025-
నమస్తే భారత్ నిర్మల్:-పట్టణంలో సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, బ్యాంకర్లతో ఆయన రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాఅదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, మండల స్థాయిలో దరఖాస్తులను ఎంపీడీవోలు, బ్యాంకు అధికారులు పరస్పర సమన్వయంతో పరిశీలించాలన్నారు. మొదటి ప్రాధాన్యతగా మహిళలు, వికలాంగులను, లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. లబ్ధిదారులకు రుణం మంజూరు చేసే ముందు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించాలన్నారు. ఒకే గ్రామంలో ఎక్కువమంది ఒకే రకమైన యూనిట్లు పెట్టే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. ఇదివల్ల వ్యాపారంలో పోటీ పెరిగి నష్టాలు వస్తాయన్నారు. సరైన లబ్ధిదారుల ఎంపికకు పారదర్శకత పాటించాలన్నారు. ఎంపికైన యూనిట్లకు సంబంధించిన గ్రౌండింగ్ పూర్తయిందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఏవైనా సందేహాలుంటే వెంటనే పై అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, ఇంచార్జి డిఆర్డిఓ శ్రీనివాస్, డిడిఎం నాబార్డ్ వీరభద్రుడు, సంక్షేమ శాఖ అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

