శివ శంభో సినిమా పాటలకు పల్లెర్ల వాసి కొరియోగ్రఫీ
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 21) : ఈనెల 25 న విడుదల కాబోతున్న శివశంభో సినిమా పాటలకు మద్దూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన కృష్ణవేణి వెంకట్ కొరియోగ్రఫీ అందించారు. సీనియర్ యాక్టర్ తనికెళ్ళ భరణి, హీరో సుమన్, యాక్టర్స్ టార్జాన్ మరియు విజయ్ రంగరాజన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా పాటలకు కొరియోగ్రఫీగా అవకాశం కల్పించినందుకు డైరెక్టర్ నర్సింగ్ కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన దాసరి పద్మమ్మ మరియు చెన్నయ్య (ఆడిటర్) గార్ల కూతురు కృష్ణవేణి తన తండ్రి యొక్క ఆశయాన్ని నెరవేర్చేందుకు కుటుంబ సహకారంతో చిన్నప్పటి నుంచి కష్టపడి భరతనాట్యంలో ప్రావీణ్యత పొంది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ మరియు ఒక ప్రైవేటు సంస్థ నుండి డాక్టరేట్ ని కూడా అందుకున్నారు. కాగా హైదరాబాద్ లో గత 10 సంవత్సరాలుగా తాండవ డ్యాన్స్ అకాడమీ ని నడిపిస్తూ ఎంతో మంది పిల్లలకి నృత్యం నేర్పిస్తూ శివశంభో సినిమాలోనీ పాటలకు కొరియోగ్రఫీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
