ఆత్మ కమిటీ ద్వారా రైతాంగానికి మరిన్ని సేవలందించాలి
ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్
ఆత్మ కమిటీ రైతులకు మరిన్ని సేవలందించే విధంగా చురుకైన పాత్ర పోషించాలని
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ పిలుపునిచ్చారు
నమస్తే భారత్ :-మరిపెడ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం లొని మరిపెడ మండలం గిరిపురం రైతు వేదికలో మరిపెడ డివిజన్ వ్యవసాయ అధికారి విజయ్ చందర్ ఆధ్వర్యంలో ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి మరియు 23 మంది డైరెక్టర్స్ చే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ నిబద్ధత నిజాయితీ క్రమశిక్షణ గల నాయకులకు మాత్రమే పదవులు వస్తాయని ఆ కోవలోనే రెండు దఫాలుగా నాకోసం నాతోపాటు కష్టించిన సిపిఐ నాయకునికి ఈ పదవి ఇవ్వడం జరిగిందని పార్టీ నాయకత్వానికి కూడా కష్టపడ్డ వారికి తప్పనిసరిగా ఫలితం ఉంటుందని అన్నారు ఆత్మ కమిటీ సుధాకర్ రెడ్డి నాయకత్వంలో అన్ని మండలాలలో సమావేశాలు ఏర్పాటు చేసిన రైతులకు మరిన్ని సాంకేతిక విషయాలను చేరవేయాలని ఆ కమిటీకి సార్ధకత ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఒంటి కొమ్ము యుగంధర్ రెడ్డి, పెళ్లి రఘువీర్ రెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి ,తాజ్ పాషా ,అభినవరెడ్డి , అఫ్జల్ ,ఆల్వాల్ ఉపేందర్, కాలం రవీందర్ రెడ్డి, డీఏవో కార్యాలయ అధికారి మురళి, 9 మండలాల వ్యవసాయ అధికారులు, ఏ ఏ ఓ లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
