ఉత్తమ సేవలకు గజమాలతో సత్కారం
ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో సన్మాన సందడి
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: ప్రభుత్వ హెడ్మాస్టర్ గా సామాజిక సేవకురాలిగా ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెలోషిప్ ఉమెన్స్ గిల్డ్ ఫౌండర్ గా విశిష్ట సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ఎం.జ్యోతిరాణికి సోమవారం కొత్తగూడెం కృష్ణా ఇన్ హోటల్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా సన్మానం జరిగింది. ఎస్జీఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ మహమ్మద్ ఖాసిం, ఉమెన్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ నూరి మెహరున్నిసా, చిట్టిమల్ల శ్వేత ఆధ్వర్యంలో జ్యోతిరాణికి గజమాలతో సత్కరించారు. శాలువా కప్పి జ్ఞాపిక ను అందజేశారు.తన సర్వీస్ లో ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు విద్యార్థులను తీర్చిదిద్దటంలో రాష్ట్ర జాతీయస్థాయిలో అవార్డులు అందుకొని అధికారుల ప్రశంసలు అందుకున్న జ్యోతి రాణి శేష జీవితం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఎస్.జి.ఎఫ్ సభ్యులు ప్రతినిధులు సభ్యులు ఆకాంక్షించారు. ఎస్జీఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు లోగాని శ్రీనివాస్, కోశాధికారి చిట్టి మళ్ల బ్రహ్మం చారి, జిల్లా ప్రతినిధులు జరీనా, హైమావతి, నసీం పాషా, సోనా, అంజలి, కళ్యాణి, సమ్మయ్య, ఖాదర్ మోహినుద్దీన్, విజయకుమార్,నజీర్, డింపుల్ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
