గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
On
నమస్తే భారత్ / మద్దూరు ( కోస్గి/గుండుమాల్), : పోలీసులకు అందిన సమాచారం మేరకు సోమవారం కోస్గి మరియు గుండుమాల్ మండలాల పరిధిలోని కమ్మరి కుంట తండా, భీమ్లా తండా, సుభ్య నాయక్ తాండ మరియు సారంగరావుపల్లి పొలిమెరల్లోని గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. సుభ్య నాయక్ తాండలో అనూష అనే మహిళ ఇంట్లో 100 లీటర్ల సారాయి తయారీకి ఉపయోగించే బెల్లం పాకం లభించగా ఆమెపై కేసు నమోదు చేసి ఆమెతో పాటు మరో ముగ్గురు అనుమానిత వ్యక్తులను గుండుమాల్ తహసిల్దార్ ముందు బైండోవర్ చేశామని తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన సారాయిని ఎవరైనా తయారు చేసిన, అమ్మిన చట్టరీత్య చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. ఈ దాడులలో కోస్గి ఎస్సై పురుషోత్తం రెడ్డి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Related Posts

Error on ReusableComponentWidget