100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తల్లికి తులాభారం

100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తల్లికి తులాభారం

నమస్తే భారత్ / మద్దూరు,  : పెళ్లయిన కొన్ని రోజులకే పెళ్ళాం మోజులో పడి తల్లిదండ్రులను పట్టించుకోని ఈ రోజుల్లో ఓ గ్రామంలో తల్లిని ప్రేమతో చూసుకోవడమే కాకుండా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొడుకులతోపాటు  కోడళ్ళు కూడా తమ సొంత తల్లిలా భావించి సోమవారం ఆమెకు  తులాభారం నిర్వహించారు. వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గోర్లోని బావి గ్రామానికి చెందిన జంబుల లక్ష్మమ్మ  100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఆమె ఐదు మంది కుమారులు బాలకృష్ణయ్య, రాములు, వెంకటయ్య, భీమన్న, సహదేవులు వారి ధర్మపత్నీలతో కలిసి బంధువులను ఆహ్వానించి ఇంటిల్లిపాది  సోమవారం పండుగ వాతావరణంలో  తులాభారం నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. దీంతో వారిని పలువురు అభినందించారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags: