కార్మికుల హక్కులను కాల రాస్తున్న ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు
- సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
నమస్తే భారత్ : రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ పురపాలక పరిది లో సోమవారం భవన నిర్మాణ కార్మిక సంఘం 4 వ మహాసభల సందర్భంగా శంషాబాద్ లోని MMR గార్డెన్ లో ఏర్పాటు చేసే రెండు రోజుల మహాసభలకి మొదటి రోజు కామ్రేడ్లు ఎలైట్ హోటల్ నుంచి ఏఐటిసి జెండాలతో భారీగా ర్యాలీ నిర్వహించి నినాదాలు చేస్తూ MMR గార్డెన్లో జరిగే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం మహాసభల ముఖ్యఅతిథిగా సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం లో ఎన్నో సమస్యలు ఉన్నాయని కార్మికులకు సరియైన వసతులు లేక కార్మికుల సమస్యలను పట్టించుకోకపోకపోవడం తో కార్మికుల యొక్క సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయిని అని అన్నారు. అడ్డా కూలీలుగా పనిచేస్తున్న కార్మికుల జీవితాలు మరీ దుర్భరంగా మారాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం నిధులు కేటాయించాల్సి ఉన్న ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో AITUC రాష్ట్ర అధ్యక్షులు MD యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు తదితరులు కార్మికుల సమస్యలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు పానుగంటి పర్వతాలు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి యూసుఫ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్ర చారి, AITUC రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు, గన్న అరపు రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిలక్ష్మీనారాయణ, AITUC జిల్లా అధ్యక్షుడు కే రామస్వామి, AITUC జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సామిడి శేఖర్ రెడ్డి, AITUC జిల్లా కార్యదర్శులు ఎస్ మల్లేష్, హరి సింగ్ నాయక్, ఎం శ్రీను నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే నర్సింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దాసరి ప్రసాద్, నర్రగిరి తదితరులు పాల్గొన్నారు,
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

