తిప్రాస్ పల్లిలో ఘనంగా ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవం
నమస్తే భారత్ / ఉట్కూర్ మండలం : ఉట్కూర్ మండలం తిప్రాసపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవం కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామేశ్వర్ రెడ్డి అధ్యక్షులుగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాతం పెంచాలని సూచించడం జరిగింది. కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు డాన్స్ నాటికలు ఆకట్టుకునే విధంగా ప్రదర్శనలు ఉత్సవంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పిఆర్టియు జిల్లా అధ్యక్షులు వై జనార్దన్ రెడ్డి సార్ గారు మాట్లాడుతూ అత్యుత్తమ విద్యాహరతను కలిగి ఉపాధ్యాయుల ద్వారానే నాణ్యమైన విద్య అందుతున్న ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షులు షేర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యతను వివరించడం జరిగింది. మండల అధ్యక్షులు కే గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో ఉన్న వసతుల గురించి సవివరంగా చెప్పడం జరిగింది. తపస్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే అన్ని రంగాలలో రాణిస్తున్నారని చెప్పడం జరిగింది. Dsc-2024 జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన యువకులను సన్మానించడం జరిగిందిఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మాణిక్ ప్రభు,నరసింహారెడ్డి,పృథ్వీరాజ్,గీత మేడం, మౌనిక మేడం,రజిత మేడం మరియు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

