ధరిత్రి దినోత్సవ స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం...
మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అభినందనీయం ఏజీఎం సివిల్ ధనసరి వెంకటేశ్వర్లు
నమస్తే భారత్: మణుగూరు : ధరిత్రి దినోత్సవ స్ఫూర్తితో మొక్కలు నాటడం వాటిని పరిరక్షించడం ప్రజల్లో అవగాహన కల్పించడం దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించడం సముచితమని సింగరేణి ఏజీఎం సివిల్ ధనసరి వెంకటేశ్వర్లు అన్నారు ధరిత్రి దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు సింగరేణి సివిల్ రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో కొండాపురం సి ఎస్ పి రైల్వే సైడింగ్ ఆవరణలో సి ఎస్ పి ఇన్ చార్జ్ డీజీఎం వి మదన్ నాయక్ గారితో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పర్యావరణ పరిరక్షణ నిర్లక్ష్యం చేయడం ఫలితంగా మానవాళి ఎనలేని మూల్యాన్ని చెల్లించు కుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సందర్భం ఏదైనా ఎండి బలరాం గారి స్ఫూర్తితో సివిల్ డిపార్ట్మెంట్ ప్రోత్సాహంతో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం స్ఫూర్తిదాయక కార్యక్రమంగా నిర్వహిస్తున్న సింగరేణి రైల్వే కాంట్రాక్ట్ కార్మికులను ఆయన అభినందించారు అదేవిధంగా పీవీ కాలనీ సింగరేణి ఏరియా హాస్పిటల్ ఆవరణలో ఉప ముఖ్య వైద్యాధికారిణి మేరీ కుమారి ముఖ్యఅతిథిగా వైద్యులతో కలిసి రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో సివిల్ సూపర్డెంట్ ఇంజనీర్ పాత్రుడు, సింగరేణి వైద్యులు డాక్టర్ పి శేషగిరిరావు , డాక్టర్ తాళ్లూరి సురేష్, డాక్టర్ ఇన్నయ్య, సివిల్ సూపర్వైజర్లు నవీన్ కుమార్, వత్సవాయి రవి వర్మ, సింగరేణి సేవా సమితి సభ్యులు ఎస్డి నాసర్ పాషా, కార్యక్రమ సమన్వయకర్త ఏ మంగీలాల్, రైల్వే కాంటాక్ట్ కార్మికులు యు శివరామకృష్ణ, కే గురుమూర్తి, జి నాగేశ్వరరావు, ఎం వెంకటేశ్వర్లు, హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికులు, ఏ ఉత్తర కుమారి, ఏ ఉమామహేశ్వరి, జి కాంతమ్మ, సిహెచ్ రేణుక సింగరేణి సెక్యూరిటీ గార్డ్ సుభద్ర తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

