అన్ని జన్మలలో కల్లా మానవ జన్మే అత్యుత్తమం: డా. కొమ్ము వెంకన్న బాబు
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్22:అన్ని జన్మలలో మానవ జన్మే అత్యుత్తమమైనదని, దీనిని సార్థకం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు పేర్కొన్నారు. మంగళవారం నాడు షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి, రామ్నగర్ కాలనీలోని అంగన్వాడి కేంద్రంలో కీర్తిశేషులు అడిషనల్ ఎస్పీ పద్మాకర్ రావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా డా. వెంకన్న బాబు మాట్లాడుతూ...మనిషిగా జన్మించాక ఎంతకాలం బ్రతికామో కాదు, సమాజానికి ఎంత సేవ చేశామన్నదే ముఖ్యం అని పేర్కొన్నారు. మానవ జీవిత విలువలపై పాఠం చెప్పిన ఆయన, కీర్తిశేషులు పద్మాకర్ రావు సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.అనంతరం పిల్లలకు ఉచితంగా పలకలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. అలాగే, సీనియర్ సిటిజన్లను సత్కరించి ఘనంగా సంబరాలు జరిపారు.ఈ కార్యక్రమంలో రాధా పద్మాకర్ రావు, అర్జున్ రావు, సూపర్వైజర్ వెంకటమ్మ, టీచర్లు పద్మ, జయమ్మ, అంగన్వాడి కార్యకర్తలు, విక్రమ్ తదితరులు పాల్గొన్నా
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

