ఇంటర్ ఫలితాల్లో తొర్రూరు విద్యార్థికి రాష్ట్రస్థాయి ర్యాంకు

ఇంటర్ ఫలితాల్లో తొర్రూరు విద్యార్థికి రాష్ట్రస్థాయి ర్యాంకు

నమస్తే భారత్ :-తొర్రూరు : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో తొర్రూర్ కు చెందిన గడల రామ్ చరణ్ రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించాడు. హనుమకొండలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న రామ్ చరణ్ మంగళవారం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను గడల రామ్ చరణ్ 436 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించాడు. అదేవిధంగా ఇంటర్ ఫలితాల్లో ప్రతిభా జూనియర్ కళాశాల చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి విజయదుందుభి మ్రోగించారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను ఎం అంజలి అనే విద్యార్థిని 466 మార్కులు, బి శరణ్య మోలి 464 మార్కులు, జి కీర్తన 452 మార్కులు, బి దీపిక, ఎం అభినవ్ అమృత 461 మార్కులు, బి హాసిని 460 మార్కులు సాధించారు. అదేవిధంగా సిఇసి విభాగంలో దియా మండల్ 469 మార్కులు సాధించారు. కాగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఆర్ వైష్ణవి 986 మార్కులు 983 మార్కులు ఎం సోనియా 981 మార్కులు బైపిసి విభాగంలో ప్రియాంక బౌమిక్ 967 మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల డైరెక్టర్లు కేఎల్ఎన్ ఆచార్య, కే సత్యనారాయణ రెడ్డి , శ్రవణ్ రావు, తిరుపతి తదితరులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి తమ కళాశాల ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

వేతన చెల్లింపు చట్టం 1936 ప్రకారం కనీస వేతనం చెల్లించాలి వేతన చెల్లింపు చట్టం 1936 ప్రకారం కనీస వేతనం చెల్లించాలి
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 22) :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథలో పనిచేస్తున్న 18 వేల మంది కార్మికులకు వేతన చెల్లింపు చట్టం 1936...
ఆంజనేయస్వామి మాలదారులకు  అన్నదానం, సాయంత్రం పాలు పండ్లు పంపిణీ 
టి యు డబ్ల్యూ జె(ఐ జె యు)  ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఎన్నిక
భూభారతి చట్టంతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.
ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
ఓడినవాడే నిజమైన గెలుపు ఎలా ఉండాలో చూపించగలడు.
రాష్ట్రస్థాయిలో రెండు ప్రథమ ర్యాంకులు సాధించిన భాగ్యరధి జూనియర్ కళాశాల విద్యార్థులు