భూభారతి చట్టంతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.
తేదీ, ఏప్రిల్ 22,2025-
నమస్తే భరత్
నిర్మల్:-జిల్లా మంగళవారం పెంబి, దస్తురాబాద్ మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నిర్వహించిన అవగాహనా సదస్సుల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయని చెప్పారు. భూముల హక్కుల భద్రతతో పాటు వివాదాల వేగవంత పరిష్కారం కోసం ప్రభుత్వం చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటోందన్నారు. భూభారతి చట్టం ద్వారా సాదా బైనామాల క్రమబద్ధీకరణ, భూముల మ్యాపింగ్, భూధార్ కార్డుల పంపిణీ వంటి అంశాల్లో రైతులకు మేలు కలగనుందని వివరించారు. ధరణి పోర్టల్లో లేని భూ సమస్యలకు ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రికార్డులలో తప్పుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, వారసత్వ భూముల లాంఛనీకరణ వంటి అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భూ వివాదాల విషయంలో ఉచిత న్యాయసహాయం, అప్పీల్ ప్రక్రియలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, తహసిల్దార్లు లక్ష్మణ్, సర్పరాజ్, వ్యవసాయ శాఖాధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
