రాష్ట్రస్థాయిలో రెండు ప్రథమ ర్యాంకులు సాధించిన భాగ్యరధి జూనియర్ కళాశాల విద్యార్థులు

రాష్ట్రస్థాయిలో రెండు ప్రథమ ర్యాంకులు సాధించిన భాగ్యరధి జూనియర్ కళాశాల విద్యార్థులు

నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ :భాగ్యరధి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇటీవలి ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను చాటారు. వివిధ గ్రూపులలో పలు రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకులు సాధించడమే కాకుండా, అత్యుత్తమ మార్కులతో కళాశాల గౌరవాన్ని పెంచారు.సీనియర్ బైపీసీ గ్రూపులో చదువుతున్న ఆప్షన్ జేబీన్ 996/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ఎంపీసీ గ్రూపులో ఎల్.రవీన 990/1000 మార్కులతో, సీఈసీ గ్రూపులో షాహిమా 983/1000 మార్కులతో, ఎంఈసీ గ్రూపులో బి.నందిని కూడా 983/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించారు.జూనియర్ ఇంటర్మీడియట్ లోనూ సానియా బేగం (ఎంఈసీ గ్రూపు) 495/500 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. బైపీసీ గ్రూపులో ఎండి.అవేజ్ 435/440 మార్కులు, ఎంపీసీ గ్రూపులో ఎల్.అంజలి 463/470 మార్కులు, సీఈసీ గ్రూపులో ఎస్.అనూష 480/500 మార్కులు సాధించి కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన విద్యార్థులకు ద్వితీయ సంవత్సరానికి పూర్తి ట్యూషన్ ఫీజును మాఫీ చేస్తున్నాం. భాగ్యరధి కళాశాల తక్కువ ఫీజుతో అత్యున్నత ఫలితాలు అందించడంలో ముందుంది. ఈ ఏడాది రెండు రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకులు సాధించడం గర్వకారణం,” అని తెలిపారు.ఈ విజయోత్సవ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు సిహెచ్.గోవిందరెడ్డి, కె.రామకృష్ణ, జి.రమేష్ బాబు, నల్ల జై శంకర్ గౌడ్ పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

వేతన చెల్లింపు చట్టం 1936 ప్రకారం కనీస వేతనం చెల్లించాలి వేతన చెల్లింపు చట్టం 1936 ప్రకారం కనీస వేతనం చెల్లించాలి
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 22) :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథలో పనిచేస్తున్న 18 వేల మంది కార్మికులకు వేతన చెల్లింపు చట్టం 1936...
ఆంజనేయస్వామి మాలదారులకు  అన్నదానం, సాయంత్రం పాలు పండ్లు పంపిణీ 
టి యు డబ్ల్యూ జె(ఐ జె యు)  ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఎన్నిక
భూభారతి చట్టంతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.
ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
ఓడినవాడే నిజమైన గెలుపు ఎలా ఉండాలో చూపించగలడు.
రాష్ట్రస్థాయిలో రెండు ప్రథమ ర్యాంకులు సాధించిన భాగ్యరధి జూనియర్ కళాశాల విద్యార్థులు