వేతన చెల్లింపు చట్టం 1936 ప్రకారం కనీస వేతనం చెల్లించాలి
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 22) :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథలో పనిచేస్తున్న 18 వేల మంది కార్మికులకు వేతన చెల్లింపు చట్టం 1936 ప్రకారం వేతనాలు చెల్లించాలని మంగళవారం మద్దూరు తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి నీరు అందించే మిషన్ భగీరథ పథకం విజయవంతం కావడంలో అధికారులతో పాటు అందులో పని చేసే కార్మికుల శ్రమ కూడా ఉందని, కావున తమను కూడా కార్మికులుగా కాకుండా ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కార్మికుల నిరంతర శ్రమ వల్లే మిషన్ భగీరథ పథకానికి అనేక అవార్డులు రివార్డులు వచ్చాయని, అలాంటి మాకు ప్రావిడెంట్ ఫండ్ తో పాటు ప్రతివారం ఒక ఒకరోజు సెలవు, ఉద్యోగులకు కల్పించే ఇతర అలవెన్స్ లు కల్పించాలన్నారు.మిషన్ భగీరథ కార్మికులు భాలప్ప,నరేష,రమేష్,మల్లేష్ మరియు యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
