పీపుల్స్ న్యూస్ ఆధ్వర్యంలో పిట్ల శంకర్ కు సన్మానం
శుభాకాంక్షలు తెలియజేసిన పీపుల్స్ న్యూస్ అధినేత శ్రవణ్
నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడుగా పిట్ల శంకర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా పీపుల్స్ న్యూస్ తెలుగు దినపత్రిక ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ కే శ్రావణ్ కుమార్ గాజులరామారంలోని పత్రిక కార్యాలయంలో టిడబ్ల్యూజెఎఫ్ కుత్బుల్లాపూర్ అధ్యక్షుడు పిట్ల శంకర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ పై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఇదిలా ఉండగా అధ్యక్షుడు పిట్లా శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర అధ్యక్షుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
