భారత్ సమ్మిట్ లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

భారత్ సమ్మిట్ లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్ 25:శుక్రవారం నుంచి హైదరాబాద్ లోని హెచ్.సి.సి. లో జరుగుతున్న భారత్ సమ్మిట్ లో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో వందకు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరు అయ్యారు. దాదాపు 450 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరు కానున్నారు.రాష్ట్రాన్ని పెట్టుబడులు, ఆర్థిక వృద్ధి, మేధో నాయకత్వంలో అగ్రగామిగా నిలిపేందుకు ఈ సదస్సు కీలకం కానున్నది. రాష్ట్రంలో దేశవిదేశీ పెట్టుబడులను పెంచడం, రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడం,సాంకేతిక ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడం తదితర సదస్సులో భాగంగా ఉన్నాయి. ఈ సదస్సులో భాగంగా రాష్ట్రంలోని వనరులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు ప్రత్యేక స్లాట్ కేటాయించారు. ఈ సదస్సులోతెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌,మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు .

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) : మంగళవారం జమ్ము కాశ్మీర్  పహల్ గాం లోని యాత్రికులపై జరిగిన  ఉగ్రదాడిని నిరసిస్తూ మద్దూరు పట్టణ కేంద్రంలోని...
టూరిస్టులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి 
భూ భారతి చట్టంతో పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
రుణాల మంజూరిలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయండి 
ఒక్కటైన గళాలు – ఉగ్రవాదానికి గట్టి సమాధానం!
వరంగల్ సభకుతరలిరండి గులాబీ జెండాను ఎత్తండి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపు
కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి