వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తిరుపతి రెడ్డి
నమస్తే భారత్ /మద్దూరు, ( ఏప్రిల్ 24) :ఉమ్మడి మద్దూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి శ్రీకారం చుట్టారు. గురువారం తిరుపతి రెడ్డితో పాటు నారాయణ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి మరియు కడ అధికారి వెంకట్ రెడ్డి పాల్గొని అల్లిపూర్ - దుప్పడుగట్టు- గోకుల్ నగర్,మోమినాపూర్ -బండ గోండ బిటి రోడ్డు,బొమ్మన్ పహాడ్ - మోమిన పూర్ బిటి రోడ్డు, పెదిరి పహాడ్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం అలాగే మద్దూరు పట్టణ కేంద్రంలో ఎంపీపీఎస్ పాఠశాల మరియు అంగన్వాడి భవనాన్ని ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి కోస్గి మార్కెట్ యార్డ్ చైర్మన్ ముద్ది భీమప్ప, పిఎసిఎస్ చైర్మన్ నర్సింలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, సంజీవ్, హన్మి రెడ్డి, వీరారెడ్డి మల్లికార్జున్,జంగం బాబు, చందు,యాసిన్, అశోక్ గౌడ్, చంద్రప్ప,వివిధ గ్రామాల మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
