పేకాట స్థావరం పై పోలీసుల దాడులు: సిఐ రామ్ లాల్
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంతన్ గోడు , కాట్రేవుపల్లి గ్రామ శివారులలో కొంతమంది డబ్బులు పందెం పెట్టుకుని పేకాట ఆడుతుండగా పక్క సమాచారంతో మక్తల్ సీఐ రామ్లాల్ ఆధ్వర్యంలో మక్తల్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు పేకాట శిబిరంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి 12 మంది వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 31,900/- రూపాయలను, 12 సెల్ ఫోన్లను, మూడు బైక్లను, పేక ముక్కలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి 12 మంది వ్యక్తులపై గేమింగ్ ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని మక్తల్ సీఐ రామ్లాల్ తెలిపారు.పట్టుబడిన వారు
1. ఎండి జలాల్ పాషా
2. చౌహన్ రాజు నాయక్
3. ఎం విజయ్ బాబు
4. కుంటపల్లి జగన్నాథ్
5. పి అడివన్న
6. కోస్గి లక్ష్మణ్
7. తెలుగు సతీష్
8. లక్ష్మణ్ నాయక్ చౌహన్
9. మెట్ల బాబు
10. పవనగిరి సురేష్
11. కుమ్మరి రఘువీర్
12. నాసిర్ హుస్సేన్.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
