మనిషి దాహార్ధిని తీర్చడమే మానవతాధర్మం
మంగ అశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అంబలి మరియు చలివేంద్రం ఏర్పాటు..
ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
పాల్గొన్న సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్25:మనిషికి నీటి దాహం తీర్చడమే మానవత ధర్మమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.శుక్రవారం షాద్ నగర్ పట్టణంలో మంగ అశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అంబలి మరియు చలివేంద్రం ప్రారంభోత్స వానికి ఆయన కేతిరిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... వేసవికాలంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ మానవత్వాన్ని చాటే సేవా మార్గం చలివేంద్రం ఏర్పాటని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు మాట్లాడుతూ..అన్ని వర్గాల ప్రజలు తమకు తోచిన విధంగా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని,తమ మానవత్వాన్ని చాటాలని కోరారు. మండుటెండలో పాదాచారులకు, సర్కారు దావాఖానాకు వచ్చే రోగులకు, ప్రజలకు స్వచ్ఛమైన అంబలిని, త్రాగునీరును అందించడం మంచి పరిణామమని, దీనిని ఏర్పాటు చేసిన మంగ అశోక్ ను వెంకన్న బాబు అభినందిస్తూ.. చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న కాంగ్రెస్ నేత కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, బసవేశ్వరప్ప, ఖదీర్, రాయికల్ శ్రీను, మంగ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘు నాయక్, మహిళా నాయకురాలు రమాదేవి, సామాజికవేత్త,ఇబ్రహీం తదితరులు పాల్గొని నిర్వాహకుడు మంగా అశోక్ ముదిరాజ్ ను అభినందించారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
