రాజీవ్ రహదారి పొన్నాల డాబాల ఫ్లైఓవర్ వద్ద సీట్ బెల్టు మరియు  ఫైన్ అమౌంట్ పెండింగ్ ఉన్న  కార్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన  సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్

రాజీవ్ రహదారి పొన్నాల డాబాల ఫ్లైఓవర్ వద్ద సీట్ బెల్టు మరియు  ఫైన్ అమౌంట్ పెండింగ్ ఉన్న  కార్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన  సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్

 నమస్తే భారత్ తేదీ: 24-ఏప్రిల్-2025 : ఈ సందర్భంగా వాహనదారులతో మాట్లాడుతూ నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలని  సూచించారు ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే సీట్ బెల్ట్ ధరించడం వల్ల కారులో ఉండే ఎయిర్  బెలూన్స్ ఓపెన్ అయి  అందులో ఉన్నవారికి  దెబ్బలు తగలకుండా రక్షణ కవచంగా నిలుస్తాయని తెలిపారు. అధిక వేగంతో వాహనాలు నడపవద్దని సూచించారు. వేసవికాలం అయినందున  ప్రతిరోజు వాహనాన్ని తనిఖీ చేసుకోవాలని సూచించారు ఎండలు బాగా ఉన్నందున ఉదయం 11 గంటల లోపు మరియు సాయంత్రం నాలుగు గంటల తర్వాత  ప్రయాణం చేయడం చాలా సురక్షితమని  తెలిపారు.కార్లపై అధిక వేగము, రాంగ్ పార్కింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, వితౌట్ సీట్ బెల్ట్, ఈరెగ్యులర్ నెంబర్ ప్లేట్  చేసిన ఫైన్ అమౌంట్ వాహనాలను గుర్తించి వాటిపై ఉన్న జరిమానా డబ్బులు 42,000/- రూపాయలు ఆన్లైన్లో కట్టించడం జరిగింది.  కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదమేనని తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  ప్రవీణ్ కుమార్   సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) : మంగళవారం జమ్ము కాశ్మీర్  పహల్ గాం లోని యాత్రికులపై జరిగిన  ఉగ్రదాడిని నిరసిస్తూ మద్దూరు పట్టణ కేంద్రంలోని...
టూరిస్టులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి 
భూ భారతి చట్టంతో పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
రుణాల మంజూరిలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయండి 
ఒక్కటైన గళాలు – ఉగ్రవాదానికి గట్టి సమాధానం!
వరంగల్ సభకుతరలిరండి గులాబీ జెండాను ఎత్తండి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపు
కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి