అవయవాలన్నిటిలో కండ్లు ముఖ్యమైనవి
అబ్బాయిపాలెం కంటి ఆపరేషన్ శిబిరానికి పోటెత్తిన కంటి రోగులు - ప్రగతి సేవా సమితి వ్యవస్థాపకులు గద్దల జాన్
నమస్తే భారత్ :-మరిపెడ : అవయవాలన్నింటిలో కండ్లు ముఖ్యమైనవని,అబ్బాయిపాలెంలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరానికి కంటి రోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని ప్రగతి సేవా సమితి వ్యవస్థాపకులు గద్దల జాన్ తెలిపారు.గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అందత్వ నివారణ సంస్థ, ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రగతి సేవా సమితి వ్యవస్థాపకులు గద్దల జాన్ పాల్గొని కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి క్యాంప్ ను ప్రారంభించారు. ఈసందర్భంగా గద్దల జాన్ మాట్లాడుతు ఫిబ్రవరి మొదలుకొని ఇప్పటివరకు 12 ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాలు నిర్వహించి సుమారు 650 మందికి ఆపరేషన్ లు చేయించామని తెలిపారు.ప్రగతి సేవా సమితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్థిక అక్షరాస్యతతోపాటు నెలకు నాలుగు ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాలు నిర్వహిస్తున్నామని , వీటితోపాటు కుటుంబాల సర్వే ద్వార వివిధ రకాల రోగులను గుర్తించి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం వృత్తి నైపుణ్య శిక్షణనిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. శిబిరంలో 103 మందిని పరీక్షించగా 63 మంది ఆపరేషన్ కు ఎంపిక జరిగిందని వారిని హైద్రాబాద్ శంకర కంటి ఆసుపత్రి కి ఆపరేషన్ కోసం పంపామని తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రగతి సేవా సమితి ప్రోగ్రాం ఆఫీసర్ గద్దల రామ్మూర్తి,జిల్లా కో ఆర్డినేటర్ ఐనాల పరశురాములు,మరిపెడ మండల కో ఆర్డినేటర్ జినక సువార్త, శంకర కంటి ఆసుపత్రి ప్రోగ్రాం ఆఫీసర్లు అమర్నాథ్ ,శివ రంగా,ప్రగతి సేవా సమితి తానంచర్ల ఏరియా కో ఆర్డినేటర్ తప్పేట్ల సతీష్,అబ్బాయిపాలెం కో ఆర్డినేటర్ జినక కృష్ణమూర్తి,మరిపెడ టౌన్ కో ఆర్డినేటర్ బోడ తుల్సానాయక్, యల్లంపేట కో ఆర్డినేటర్ నలబోతు విజయ, ప్రభుత్వ పాఠశాల అటెండర్ అనంతగిరి అప్పయ్య,శంకర కంటి ఆసుపత్రి సిబ్బంది,వివిధ గ్రామాల నుండి కంటి రోగులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
