పదవ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
నమస్తే భరత్
నిర్మల్ :// జిల్లాతో పాటు పాల్ గ్రామంలో నేటి నుంచి ప్రారంభం అయిన పదవ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించి జిల్లా కేంద్రంలోని రవి హైస్కూల్, సోన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలోని పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహిస్తున్నారా? నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ఏ.ఎన్,ఎం, సిబ్బంది, టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయా అని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి కాపీయింగ్ కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ వాచీలు వంటి ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి. రామారావ్, అధికారులు పరమేశ్వర్, తహసీల్దార్ లు మల్లేష్, రాజు, సిబ్బంది, తదితరులు ఉన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

