జర్నలిస్టుల సంక్షేమంపై కమిటీ వెయ్యాలి 

* వర్కింగ్ జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వండి  * అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని ప్రస్తావన 

జర్నలిస్టుల సంక్షేమంపై కమిటీ వెయ్యాలి 

నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం  బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక కమిటీ వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కొత్తగూడెంలో గత కొద్ది రోజులుగా జర్నలిస్టులు ఇంటి స్థలంతో పాటు ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరుతూ స్థానిక గంగాబిషన్ ఏరియాలో నిరసన దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. జర్నలిస్టులు చేస్తున్న దీక్షలను ఎమ్మెల్యే సాంబశివరావు దృష్టికి పోవడంతో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలో ఆయన ప్రస్తావించి జర్నలిస్టుల సంక్షేమంపై తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం అమలు పై కమిటీ వెయ్యాలన్నారు. నిజమైన జర్నలిస్టు లకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని కోరారు. పాత్రికేయులకు కుటుంబాలకు విద్య వైద్యం కల్పించాలన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ విచారణలో ఫేక్ జర్నలిస్టులు ఉంటే వారిని పక్కనపెట్టి అసలైన జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. స్థలాల కేటాయింపులో అడ్డంకులను ప్రభుత్వం తొలగించి సాధ్యమైనంత త్వరలో పరిష్కారానికి చొరవ చూపాలని అసెంబ్లీలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రస్తావించారు. జర్నలిస్టుల సమస్యల గురించి అసెంబ్లీలో కూనంనేని ప్రస్తావించిన నేపథ్యంలో ఆయనకు కొత్తగూడెం జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇదేం ఆట..! పెవిలియన్‌కు క్యూ కట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. అసహనం వ్యక్తం చేసిన కావ్య మారన్‌..! ఇదేం ఆట..! పెవిలియన్‌కు క్యూ కట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. అసహనం వ్యక్తం చేసిన కావ్య మారన్‌..!
ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం సొంత మైదానంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్‌ మరోసారి విఫలమయ్యారు. ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ,...
నిరుపేదల ఆత్మగౌరవ పథకమే సన్నబియ్యం : కలెక్టర్ సిక్తా పట్నాయక్
బ్రహ్మోత్సవాలకు మహామ్మాయిదేవి ముస్తాబు
మేడ్చల్‌లో యువతిపై లైంగికదాడికి యత్నించిన దుండగులు
రేవంత్ రెడ్డి వస్తున్నాడని పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు?
నేతకాని మహర్ రాష్ట్రస్థాయి సదస్సుకు మాల మహానాడు మద్దతు
మోదీని క‌లిసిన శ్రీలంక మాజీ క్రికెట‌ర్లు.. జ‌య‌సూర్య విజ్ఞ‌ప్తికి స్పందించిన ప్ర‌ధాని