కార్గో ద్వారా భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు
ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలి చిలువేరు సమ్మయ్య గౌడ్
నమస్తే భారత్ :-కేసముద్రం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో ఏప్రిల్ 6న సీతారాముల కళ్యాణం జరుగుతుండగా,ఈ కార్యక్రమానికి వెళ్లలేని భక్తుల కోసం స్వామివారి కల్యాణ తలంబ్రాలను టిజీఎస్ఆర్టిసి కార్గో సేవల ద్వారా బుక్ చేసుకుని,వాటిని పొందవచ్చని కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ తెలిపారు. శుక్రవారం కేసముద్రంలో స్వామివారి కల్యాణానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ కేసముద్రం మున్సిపాలిటీ లోని కార్గో కార్యాలయంలో ముందస్తుగా భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం రూ.151 చెల్లించి బుక్ చేసుకోవాలని తెలిపారు. మున్సిపాలిటీలోని, మండల కేంద్రంలోని ప్రజలందరూ ఆ సీతారాముల కరుణాకటాక్షాలు పొందాలని ఈ సదవకాశాన్ని అందరూ. సద్వినియోగపరుచుకోవాలని విజ్ఞప్తి చేశారు చిలువేరు సమ్మయ్య గౌడ్.పూర్తి వివరాల కోసం కేసముద్రం కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వేలాద్రి సెల్ నెం 9154298968, కార్గో ఆఫీస్ నెంబర్ 9100477150, కేసముద్రం 91214 44477 నంబర్లను సంప్రదించాలని సూచించారు..
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

