అపరిచితుల వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దు
ములుగు ఎస్సై విజయ్ కుమార్
నమస్తే భారత్ ములుగు:
తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ములుగు* విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, ఈవిటీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియాల వల్ల కలిగే నష్టాల గురించి గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి అవగాహనకల్పించిన ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, మరియు గజ్వేల్ షీటీమ్ బృందం, భరోసా సెంటర్ సిబ్బంది.
- సోషల్ మీడియాను అవసరం ఉన్న వరకు మాత్రమే వాడుకోవాలి
- తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని చదువుకోవాలి
- ఇష్టపడి చదివి మీరు అనుకున్న గోల్ సాధించాలి
ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం ఏర్పరచుకొని క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలి ఈ సందర్భంగా ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, మాట్లాడుతూ* మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీ టీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీ టీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు,నూతన చట్టాల గురించి, మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది,మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మహిళల భద్రత మా ముఖ్య బాద్యత.చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అన్నారు, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు,పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని మరియు సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ పుష్పలత మరియు ఉపాధ్యాయులు, గజ్వెల్ షీటీమ్ బృందం శ్రీరాములు -ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ లావణ్య, కానిస్టేబుల్ మహేష్, ములుగు పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
