పేకాట స్థావరం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్, పోలీసుల దాడి
9,480/- వేల రూపాయలు 03 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు
నమస్తే భారత్ సిద్దిపేట : త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్కటూర్ గ్రామ శివారులో* కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, త్రీ టౌన్ పోలీసులు వెళ్లి రైడ్ చేసి * నలుగురిని అదుపులోకి తీసుకున్నారు మరో ముగ్గురు పారిపోయినారు. వారి వద్ద నుండి 9,480/- వేల రూపాయలు, 03 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు.
త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
పేకాట ఆడిన వారి వివరాలు
1 పెరుగు కిష్టయ్య తండ్రి ఐలయ్య, నివాసం వెలికట్ట
2 లెంకలా కనకయ్య తండ్రి భూపతి, నివాసం పొన్నాల
3 వల్లపు కనకయ్య తండ్రి కొండయ్య, నివాసం మర్పడుగా.
4 మహమ్మద్ నహీం తండ్రి శఫయుద్దీన్, నివాసం దుద్దెడ.
పారిపోయిన వారి వివరాలు
5 రాము, నివాసం నాంచారు పల్లి
6 కిషన్, గ్రామం వెల్కటూర్
7 చారి, నివాసం సిద్దిపేట
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

