ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులంతా క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులంతా క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

నమస్తే భరత్

నిర్మల్:-పట్టణంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుండి MA&UD ప్రిన్సిపాల్ సెక్రటరీ దానకిషోర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ అభిలాష్ అభినవ్  పాల్గొన్నారు. జిల్లాలు, మున్సిపాలిటీల వారిగా ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులపై చర్చించారు.అనంతరం కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతు, ఎల్ఆర్ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ) కు దరఖాస్తు చేసుకున్న వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే పలువురు దరఖాస్తుదారులంతా రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లిస్తున్నారని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల పరిధిలలో ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ రుసుములో 25 శాతం రాయితీ కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎల్ఆర్ఎస్ద రఖాస్తుదారులంతా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలని తెలిపారు. మార్చి 31 వ తేదీతో లే అవుట్ల దరఖాస్తుల రుసుము చెల్లించే గడువు ముగుస్తుందన్నారు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన రుసుములు చెల్లించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, యాదవ్ కృష్ణ, రాజేష్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు
ముంబై ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకడైన తహవూర్‌ రాణా ను అమెరికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఆయన్ని భారత్‌కు తరలిస్తున్నారు. రాణాతో వస్తున్న...
పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి: సీపీఎం
మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు
షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన దుకాణాలను ప్రజాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తా
మధిరలో పూర్తైన‌ వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించాలి : ఏలూరి నాగేశ్వర్‌రావు
కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలుగా రేషన్‌ దుకాణాలు : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
గర్భిణుల‌కు పోష‌కాహారం అందించాలి : సీడీపీఓ లక్ష్మి ప్రసన్న