ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నుమర్యాదపూర్వకంగా కలిసిన మాల నాయకులు
నమస్తే భారత్ :-తొర్రూరు : ఎమ్మెల్సీగా ఎన్నికైన అద్దంకి దయాకర్ ను మాల మహానాడు జిల్లా నాయకులు ఆదివారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు.మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చిట్టి మల్ల మహేష్ ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, జాతీయ కార్యదర్శి ఆశోద భాస్కర్ లు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అద్దంకి దయాకర్ విశేష కృషి చేశాడని, ఆయన సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం గర్వకారణమన్నారు. రాజకీయ విశ్లేషకులుగా, సామాజిక అంశాలపై స్పందించే వ్యక్తిగా ఆయనకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని తెలిపారు. దళితుల హక్కుల కోసం గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి సైన్యం యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు గార ఉపేందర్, మానుకోట జిల్లా ఉపాధ్యక్షులు సంద అనిల్, తొర్రూరు డివిజన్ అధ్యక్షులు గొడిశాల నవీన్, తొర్రూరు డివిజన్ యువ నాయకులు ఎనమల రాకేష్, నెల్లికుదురు మండల అధ్యక్షులు కారం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
