నందిగామ అయ్యప్ప స్వామీ దేవాలయాన్ని దర్శించుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
నమస్తే భారత్,షాద్ నగర్ మార్చ్ 26 : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని నూతనంగా నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి. ఈ సందర్బంగా అయ్యప్ప స్వామిని దర్శించుకున్న విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామీ ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని స్వామీ వారిని కోరుకోవడం జరిగింది. నూతన దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి శబరిమల దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కంఠారు రాజు వారు తంత్రి రావడం భక్తులకు ఎంతో సంతోషకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్,మోహన్ సింగ్,చేగు సుధాకర్, కొత్తూరు మండల అధ్యక్షులు అత్తాపురం మహేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మిద్దె గణేష్, మల్ చలం మురళి,చౌదరి గూడ మండల అధ్యక్షులు గడ్డమిది రాజు,బాల్ రెడ్డి, చెట్ల వెంకటేష్,బోయ అశోక్,రంగన్న గౌడ్, అనిల్ గౌడ్ స్వామీ, శ్రీనివాస్ చారి,శ్రీరామ్ రెడ్డి, బంటారం వెంకటేష్ గౌడ్,సుమన్ గౌడ్,శ్రీనివాస్,తదితరులు ఉన్నారు..
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
