రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ ఎన్నికల సంఘం నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ ఎన్నికల సంఘం నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

నమస్తే భరత్

నిర్మల్ :- పట్టణంలోని గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ అభిలాష్ అభినవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సంబంధించిన అన్ని నియమాలు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఎజెంట్లుగా నియమించుకోవాలని, ఎజెంట్ల బాధ్యతలు, హక్కులను తెలియజేయాలని సూచించారు. ఫారం 6, 7, 8 లకి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందన్నారు. ఓటరు జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దుకునే అవకాశం కల్పించడం జరిగిందని, ఓటర్లు తమ పేరు, చిరునామా, తదితర వివరాలు సవరించుకుకోవాలనుకుంటే తహసిల్దార్, మున్సిపల్, ఆర్డీఓ కార్యాలయాల్లో తమ దరఖాస్తులను ఇవ్వవచ్చునన్నారు. నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరిని తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఒకే ఓటరు ఇతర చోట్ల ఓటు హక్కు ఉన్న, నకిలీ ఓటర్ల ఏరివేత ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం తీసుకునే చర్యల్లో రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్  కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, బిజెపి, టిడిపి, వైఎస్సార్ సిపి, ఎంఐఎం ఆమ్ ఆద్మీ పార్టీల ప్రతినిధులు కొరిపెల్లి శ్రావణ్ రెడ్డి, రమేష్, నరేష్, మజార్, షేక్ హైదర్ లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు
ముంబై ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకడైన తహవూర్‌ రాణా ను అమెరికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఆయన్ని భారత్‌కు తరలిస్తున్నారు. రాణాతో వస్తున్న...
పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి: సీపీఎం
మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు
షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన దుకాణాలను ప్రజాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తా
మధిరలో పూర్తైన‌ వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించాలి : ఏలూరి నాగేశ్వర్‌రావు
కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలుగా రేషన్‌ దుకాణాలు : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
గర్భిణుల‌కు పోష‌కాహారం అందించాలి : సీడీపీఓ లక్ష్మి ప్రసన్న