శ్రీ రాగాలో ఘనంగా ఫుడ్ ఫెస్ట్
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: కొత్తగూడెం క్వాలిటీ పరిధిలోని మేదర బస్తిలో ఉన్న శ్రీ రాగా ప్లే అండ్ హై స్కూల్ లో శుక్రవారం ఫుడ్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిస్తూ మన భారత దేశ ఆహార సంస్కృతికి మూలమైన ఆహార సాంప్రదాయాల పట్ల అవగాహనను కల్పిస్తూ శ్రీ రాగాలో ఫుడ్ ఫెస్ట్ ను నిర్వహించారు. పిల్లలు వారి పేరెంట్స్ సహాయంతో ఇంటి వద్దనే వారి ఫుడ్ ఐటమ్స్ ను ప్రిపేర్ చేసుకొని వచ్చారు. ఈ ఫుడ్ లో స్పైసి గాని ఆయిల్ గాని నాన్ వెజ్ గాని పొయ్యిమీద ఉడికించిన ఫుడ్ ఐటమ్స్ గాని ఉండకుండా తెచ్చిన ఐటమ్స్ అన్నింటినీ స్టాల్స్ లా ఏర్పాటు చేసి ప్రతి ఫుడ్ ఐటమ్ కు కొంత ధర నిర్వహించారు. ఈ ఫుడ్ ఫెస్ట్ ను విజిట్ చేయాలని పేరెంట్స్ ను ఆహ్వానించారు. పెరెంట్స్ అందరూ ఈ ఫుడ్ ఫెస్ట్ ను బిజిట్ చేసి ఈ ఫుడ్ ఐటమ్ ను కొనుక్కుని ప్రతి ఒక్కరి ఫుడ్ ఐటమ్ ను రుచి చూశారు. ఈ ఫుడ్ ఫెస్ట్ ను సందర్శించిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోయారు.. భారత దేశం యొక్క విభిన్న శాస్కృతుల్ని శ్రీ రాగాలో పిల్లలందరికీ అవగాహన కల్పిస్తున్నారు. అందుకు మేనేజ్మెంట్ ను పలువురు అభినందిస్తున్నారు. ఈ ఫుడ్ ఫెస్ట్ లో ఏర్పాటు చేసిన సేల్స్ కోయింటర్ ద్వారా కలెక్ట్ అయిన అమౌంట్ మొత్తాన్ని శ్రీ రాగా చిన్నారుల చేతుల మీదుగా అనాధ సరణాలయానికి డొనేట్ చేయుటకు నిశ్చయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల యాజమాన్యం మల్లారపు వర ప్రసాద్, డైరెక్టర్ కవిత ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

