వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ
నమస్తే భారత్,,,, 20/3/2025/, నారాయణపేట జిల్లా :
మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామంలో మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి గారి సహకారంతో లయన్స్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కంటి శస్త్ర చికిత్స చేసుకున్న వారికి అందజేత.. మఖ్తల్ నియోజకవర్గం మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా దాదాపు 35మందికి సమస్యలు గుర్తించి, మహబూబ్ నగర్ లోని కందూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు పూర్తి చేశారు. తిరిగి గుడిగండ్ల గ్రామానికి చేరుకున్న వారికి గురువారము రోజు ఉచిత కంటి అద్దాలు, మందులు, పండ్లు& బ్రెడ్లు ఉచితంగా అందజేశారు. కంటి శస్త్ర చికిత్సలు చేసుకున్న వారు గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్న శ్రీహరి అన్న సేవా సమితి కి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే గారు తెలపడం జరిగింది , కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ గౌడ్, భరత సింహారెడ్డి, సిపి తిరుపతయ్య, కురువ రమేష్, మేకల రాజు, కూసురు రాజు, ఏ. రవికుమార్, నూరుద్దీన్ , అసముద్దీన్, బోయ నరసింహ , రామ్ రెడ్డి లయన్స్ ఆసుపత్రి సిబ్బంది సత్యం గౌడ్, ఖాజాద్దీన్ గుడిగండ్ల నాయకులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
