సంతోష్ కుటుంబానికి అండగా ఉంటా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
నమస్తే భారత్ :-తొర్రూరు : కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని హరిపిరాల గ్రామానికి చెందిన సుంచు సంతోష్ తండ్రి సుంచు రాములు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి రాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు వారి కుటుంబానికి అందే విధంగా కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుంచు రాములు మృతి బాధాకరమన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, జాటోత్ నెహ్రు నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్, తొర్రూరు పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, నాయకులు చాపల బాపురెడ్డి, మంగళపల్లి రామచంద్రయ్య, సురేందర్ రెడ్డి, చెవిటి సధాకర్, తూణం శ్రావణ్ కుమార్,గంజి దేవేందర్ రెడ్డి, రవి నాయక్, రాజేష్ యాదవ్, బాలకృష్ణ, రావుల కిషన్ రెడ్డి, మహేష్ యాదవ్,తోట అశోక్, పరశురాములు,గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

