క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి 5 లక్షల ఎల్ ఓ సి అందజేసిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
నమస్తే భారత్ :-వరంగల్ అపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సిఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ, రెడ్డి కాలనీకి చెందిన యండి . నజీం అహ్మద్ కుమారుడు ఆదిల్ అహ్మద్ కు వైద్య చికిత్స కోసం హైదరాబాద్లోని MNJ క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం సిఎంఆర్ఎఫ్ ద్వారా 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మంజూరు చేయించారు. ఈ మేరకు సోమవారం హన్మకొండ, కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి ఎల్ఓసి అనుమతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఎల్ఓసిని మంజూరు చేయించిన ఎంపీ డా.కడియం కావ్యకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలోను బాలుడి పరిస్థితిని చూసి చలించిన ఎంపీ డా.కడియం కావ్య కడియం ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా వైద్యులను అడిగి తెలుసుకున్న ఎంపీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

