ఆకాశవాణిలో బొమ్మనపల్లి విద్యార్థుల గళం
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో కదంబ కార్యక్రమాన్ని ఇచ్చి తమ ప్రతిభను చాటిచెప్పారు. బొమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో తమ ప్రతిభను ప్రదర్శించే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పాటలు గేయాలు సామెతలు కథలు ఇంగ్లీష్ రైమ్స్ పొడుపు కథలు నాటికల ప్రదర్శన ద్వారా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బొమ్మనపల్లి చరిత్రలోనే తొలిసారిగా విద్యార్థులు ఈ అత్యుత్తమ ప్రతిభను ఆకాశవాణిలో ద్వారా చాటిచెప్పారు. ఐదో తరగతి విద్యార్థిని డి.ఊహ అద్భుతంగా యాంకరింగ్ చేసింది. పాఠశాల హెచ్ఎం ఎం.జ్యోతిరాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కదంబ కార్యక్రమంలో 23 మంది విద్యార్థులు పాల్గొని తమ గళాన్ని ఆకాశవాణి ద్వారా వినిపించారు. ఇదిలా ఉండగా హెచ్ఎం జ్యోతిరాణి కూడా భద్రాద్రి జిల్లాలో "బాలమేళా"పై ఆకాశవాణిలో సమీక్ష ప్రసంగం ఇచ్చారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
