ఆశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి నశించాలి. ఫిక్స్డ్ వేతనం 18000/- చెల్లించాలి.
.. జి. వెంకట్రాంరెడ్డి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు.
నమస్తే భరత్,, 25/3/2025/ నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని, ఫుల్ మామిడి గ్రామంలో : రాష్ట్ర ప్రభుత్వం ఆశాలోకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిన్న కమిషనరేట్ ముందు ధర్నా కార్యక్రమానికి వెళ్లిన ఆశాలపట్ల నిర్బంధాన్ని ప్రయోగించడం కాకుండా అనేకమంది గాయాల పాలయ్యారు. ఆశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు పులిమామిడి గ్రామంలో పి హెచ్ సి పరిధిలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి పిఎస్సి అధ్యక్షురాలు పద్మమ్మ అధ్యక్షత వహించగా ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడిన సిఐటియు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం ఆశాలపట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడి వాళ్ల సమస్యల పరిష్కారం కొరకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఆశాలు కొత్తగా ఏమీ కోరడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ అయిదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఆశాల సమస్యలకు ముందుకు రాకపోతే ఉద్యమం మరింత అద్భుతంగా మారే అవకాశం ఉందని అనంతర పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు శివపుగౌడ్ మాట్లాడుతూ ఆశాలు చేస్తున్న పోరాటానికి తెలంగాణ రైతు సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని మీ పోరాటాల్లో మేము భాగస్వామి అవుతామని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పరాదని వేతనాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జైనాబి,ఆషాభి, సంతోష,రేణుక,పద్మ, సంధ్యారాణి, మణెమ్మ,చెన్నమ్మ, సావిత్రి, బాలమ్మ, పద్మ, అనురాధ,విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
