శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా పదవ ఆదివారం చివరి వారం అగ్నిగుండాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్
నమస్తే భారత్ / కొమురవెల్లి : చివరి ఆదివారం అగ్నిగుండాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇట్టి బందోబస్తును 3 సెక్టార్లుగా విభజించడం జరిగింది టెంపుల్ ఆవరణ చుట్టుపక్కల దర్శన ప్రదేశాలు ఒక సెక్టరుగా తోటబావి అగ్నిగుండాల ప్రదేశం రెండవ సెక్టార్పార్కింగ్ ప్రదేశాలు రెండవ సెక్టార్గా విభజించడం జరిగింది. ప్రతి ప్రదేశాన్ని పరిశీలించి భారీ కేటింగ్ తదితర అంశాల గురించి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుందన్నారు వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయడం జరిగింది కంట్రాల్ రూంను ఏర్పాటు చేస్తున్నాం ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన వారు కంట్రోల్ రూంలో అందుబాటులో వుండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు మరియు విఐపి దర్శనం, శీఘ్ర దర్శనం, సాధారణ దర్శనం మూడు విభా మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. పెద్ద తోట బావి పెద్దపట్నం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది, పార్కింగ్ ప్రదేశాలలో మరియు టెంపుల్ ఆవరణలో 80 సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘాఏర్పాటు చేయడం జరుగుతుంది. *అడిషనల్ డీసీపీ /01, ఎసిపిలు/04, సిఐలు/13, ఎస్ఐలు/30 ఏఎస్ఐలు/ హెడ్ కానిస్టేబుళ్లు,/ కానిస్టేబుళ్లు/ మహిళా కానిస్టేబుళ్లు/ మహిళ హోంగార్డులు/,బీడీ టీమ్స్, యాక్సెస్ కంట్రోల్, రోప్ పార్టీ మొత్తం అధికారులు సిబ్బంది 270, మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ మేడమ్ గారు తెలిపారు పార్కింగ్ ప్రదేశాలు: తోటబావి సమీపంలో ఎడమవైపు చుట్టు కాంపౌండ్ వాళ్ళు ఉన్న ప్రదేశంలో విఐపి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.చేర్యాల, కిష్టంపేట మరియు సిద్దిపేట, కొమురవెల్లి కమాన్ నుండి వచ్చే వాహనదారులు కొమురవెల్లి బస్టాండ్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్, ప్రజ్ఞాపూర్, కొడకండ్ల, చిన్న కిష్టాపూర్ కొండపోచమ్మ టెంపుల్ నుండి వచ్చే వాహనదారులకు పెట్రోల్ పంపు వెనుక భాగమున, పద్మశాలి నిత్య కళ్యాణ సత్రం ఎడమ వైపు ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.పార్కింగ్ ప్రదేశాల్లో తప్ప ఇతర ప్రాంతాలలో ఎవరు వాహనాలు పార్కు చేసుకోవద్దు వాహనాలు టెంపుల్ ఆవరణలోనికి అనుమతి లేదు. శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి పదవ ఆదివారం చివరి వారం అగ్నిగుండాలకు వచ్చే భక్తులు పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి వాహనాలు పార్కింగ్ ప్రదేశంలో పార్కు చేసి ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకుని వెళ్లాలని కమిషనర్ మేడమ్ గారు సూచించారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
