శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పది ఆదివారాలపాటు బందోబస్తు నిర్వహించిన పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్ బి. అనురాధ, ఐపీఎస్
నమస్తే భారత్ సిద్దిపేట : పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో జరిగే అతి పెద్ద జాతర అయినా శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గత మూడు నెలల నుండి 10 ఆదివారాలపాటు మరియు అందులో ముఖ్య ఘట్టాలైన చిన్న పట్నం, పెద్దపట్నం, లస్కర్ బోనాలు, చివరి ఆదివారం అగ్నిగుండాలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించిన పోలీస్ అధికారులను సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ హుస్నాబాద్ ఏసిపి సతీష్, గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, సిద్దిపేట ఏసీపి మధు, ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, చేర్యాల సిఐ శ్రీను, కొము రవెల్లి ఎస్ఐ రాజు, చేర్యాల ఎస్ఐ నిరేష్, మద్దూర్ ఎస్ఐ షేక్ మహబూబ్ మరియు పోలీస్ అధికారులు, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

