వనమేధం లోగుట్టు.. గ్రోక్ రట్టు
హైదరాబాద్, : జీవ వైవిధ్యానికి, పచ్చదనానికి ఆలవాలమైన హెచ్సీయూ భూముల్లో రేవంత్ ప్రభుత్వం సాగించిన దమనకాండపై యావత్తు దేశం ఒక్కటై నినదించింది. అర్థరాత్రి పూట గుట్టుచప్పుడు కాకుండా మూగజీవాలపై ఉరికిన వందలాది బుల్డోజర్లను భారతావని ముక్తకంఠంతో నిరసించింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న వనమేధంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం రేవంత్ ప్రభుత్వంపై కన్నెర్రజేసింది. ఈ క్రమంలో అసలు హెచ్సీయూలో ఏం జరిగింది? పచ్చటి ప్రకృతిని చెరబట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? హెచ్సీయూలో మంటలు రేపి రేవంత్ సర్కారు సాధించిందేంటి? ఈ వివాదంపై రాహుల్ ఎందుకు స్పందించట్లేదు? డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ ఈ వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారా? పర్యావరణ పరిరక్షణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? కేసీఆర్ సర్కారు అడవులను ఎలా సంరక్షించింది? అంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ ‘గ్రోక్’ సవివరంగా సమాధానాలు ఇచ్చింది. హెచ్సీయూలోని 400 ఎకరాల భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించాలన్న రేవంత్ ప్రభుత్వ నిర్ణయం వల్లే అక్కడ విద్యార్థుల ఉద్యమం చెలరేగింది. సర్కారు నిర్ణయంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ చర్యలతో ఈ భూముల్లోని జీవ వైవిధ్యం దెబ్బతింటుందని, జీవాలు ఆవాసాన్ని కోల్పోతాయని, హైదరాబాద్కు ఊపిరితిత్తులుగా ఉన్న వందల ఏండ్లనాటి వృక్షాలు నేలకొరగడం మంచిదికాదంటూ పర్యావరణ ప్రేమికులు, విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. మార్చి 30న మొదలైన నిరసనలను అణిచివేయడానికి పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. అడ్డొచ్చిన వారిని ఈడ్చుకెళ్లారు. బీఆర్ఎస్ వంటి పార్టీలు, విద్యార్థి సంఘాలు హెచ్సీయూ విద్యార్థులకు సంఘీభావాన్ని ప్రకటించాయి
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

