భజరంగ్ జయంతి.. శోభాయమానంగా మరీనా కైసర్ నగర్.!

అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి భారీగా పోటెత్తిన భక్తులు

భజరంగ్ జయంతి.. శోభాయమానంగా మరీనా కైసర్ నగర్.!

IMG-20250412-WA0054

భక్తి పారవశ్యంతో వెలిగిన కైసర్ నగర్ ప్రాంతం

అంజన్నకు ప్రత్యేక పూజలు చేసిన మద్దెల సాయి బాబా

అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించిన దేవాలయ కమిటీ సభ్యులు

 

కుత్బుల్లాపూర్ : జై హనుమాన్ జై భజరంగ్ నినాదాలతో గాజులరామరం గ్రామంలోని కైసర్ నగర్ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం మారుమోగింది. హనుమాన్ జయంతి పర్వదిన సందర్భంగా శనివారం ఉదయం నుండే ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీగా భక్తులు చేరుకోవడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పండితులు ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహించి, రాకరకాల పండ్లు, పూలతో అలంకరించారు. ఆంజనేయ స్వామికి దేవాలయ ఛైర్మెన్ మద్దెల సాయిబాబా ప్రత్యేక పూజలు చేశారు.

WhatsApp Image 2025-04-12 at 4.42.15 PMఅనంతరం అంజన్నను స్థానికులు దర్శించుకున్నారు. స్థానిక 125 డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి రావు ముఖ్యాతిధిగా పాల్గొని హనుమంతుడి ఆశీర్వాదం తీస్కున్నారు. దర్శనానికి వచ్చిన బస్తి పెద్దలకు, నాయకులకు, అతిధులకు కాషాయ కండువా కప్పి సత్కరించారు.

WhatsApp Image 2025-04-12 at 7.12.46 PM (1)

WhatsApp Image 2025-04-12 at 7.12.46 PMWhatsApp Image 2025-04-12 at 7.12.45 PMఅనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నప్రసాదన్నీ  దాదాపు 2000 మంది  స్వీకరించారు.

WhatsApp Image 2025-04-12 at 4.42.14 PMఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుడు సాయి బాబా మాట్లాడుతూ., స్వచ్ఛమైన హృదయంతో ప్రతిరోజూ అంజన్నను పూజిస్తే జీవితం సకల మంగళం అవుతుందని అన్నారు. జై హనుమాన్ ఈ ఒక్క మాట అన్ని భయాలను తొలగిస్తుందని అందుకే ప్రతిఒక్కరు హనుమాన్ చాలీసా చదవాలని సూచించారు. ఆంజనేస్వామిని పూజించండతో జీవితంలో బాధలు, కష్టలు తొలగి సంతోషంగా జీవిస్తారని తెలిపారు. కలియుగంలో కష్టాలు తీర్చే దేవుడు భజరంగ్ భళని కొనియాడారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని కోరామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కమలాకర్, కస్తూరి బాలరాజు, పర్స శ్రీనివాస్ యాదవ్, అజయ్ గుప్తా, చిన్న బాబు, శివ కుమార్, నరేష్, భాస్కర్, చంద్ర, రాజు యాదవ్, శ్రీశైలం, సురేష్, బాలకృష్ణ, వెంకటేశం, భాస్కర్ రావు, వెంకటేష్, జిత్తు, చంద్ పాషా, బాలకృష్ణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2025-04-12 at 4.42.14 PM (1)

 

Views: 4

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీటెక్ బయో టెక్నాలజీ రెగ్యులర్ కోర్సును ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రారంభించాలి: డాక్టర్ అడ్డగట్ల రవీందర్ బీటెక్ బయో టెక్నాలజీ రెగ్యులర్ కోర్సును ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రారంభించాలి: డాక్టర్ అడ్డగట్ల రవీందర్
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ఓయూ, జేఎన్టీయూ, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ వంటి ప్రభుత్వ యూనివర్సిటీలలో బీటెక్ బయోటెక్నాలజీ రెగ్యులర్ కోర్సును 2025-26 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలని...
సెలవు రోజు కూడా రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కెమిస్ట్ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా వినోద్‌కుమార్‌
సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫోటోలు, మరియు రాజకీయ విద్వేషాలు  రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం 
జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్
భారతీయ ఫార్మా కంపెనీ గోదాముపై రష్యా దాడి..