న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి.. హుజూర్‌నగర్‌ కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు

న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి.. హుజూర్‌నగర్‌ కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు

హుజూర్ నగర్, ఏప్రిల్ 4: న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలుచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయవాదులు డిమాండ్ చేశారు. గోదావరిఖని న్యాయవాది నూతి సురేష్‌పై దాడికి నిరసనగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని  కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కోర్టు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో న్యాయవాదులపై భౌతికదాడులు అధికమయ్యాయన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు, ముఖ్యంగా న్యాయవ్యవస్థకు గొడ్డలి పెట్టని చెప్పారు. రాజ్యాంగానికి విధేయులుగా, తమ కక్షిదారులను రక్షించేందుకు చట్టప్రకారం విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులపై భౌతిక దాడులు జరపటం అత్యంత జుగుప్సాకరని తెలిపారు.ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధుల బహిష్కరణ కార్యక్రమానికి సహకరించాలని కోరుతూ బార్ అసోసియేషన్ తీర్మాన కాపీలను రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్యాం శ్రీ, సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యామ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి భవ్యశ్రీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, జక్కుల నాగేశ్వరరావు, సుంకరి ప్రదీప్తి, తెప్పని శ్రీలక్ష్మి, చేకూరి శృతి, కుక్కడపు బాలకృష్ణ, ధూళిపాల శ్రీనివాసరావు, చనగాని యాదగిరి, చల్లా కృష్ణయ్య, చక్రాల వెంకటేశ్వర్లు, కొట్టు సురేష్, పాలేటి శ్రీనివాసరావు, ఉదారి యాదగిరి, బానోతు శ్రీను నాయక్, నాగూర్ పాషా, శివ తదితరులు పాల్గొన్నారు. 

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. ఆ ఐదుగురికి ఉరే ఖరారు..! దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. ఆ ఐదుగురికి ఉరే ఖరారు..!
  దిల్‌సుఖ్‌నగర్‌  బాంబు పేలుళ్ల  కేసులో గతంలో ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పునే తెలంగాణ హైకోర్టు  ఖరారు చేసింది. పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న ఆ ఐదుగురికి
ట్రాఫిక్ సిబ్బందిపైకి దూసుకెళ్లిన లారీ.. కానిస్టేబుల్‌ మృతి
హసన్‌పర్తిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. ఆరుగురికి తీవ్రగాయాలు
శ్రీరామ నవమి ఉత్సవాలు.. రమణీయంగా రథోత్సవం
ఇదేం ఆట..! పెవిలియన్‌కు క్యూ కట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. అసహనం వ్యక్తం చేసిన కావ్య మారన్‌..!
నిరుపేదల ఆత్మగౌరవ పథకమే సన్నబియ్యం : కలెక్టర్ సిక్తా పట్నాయక్
బ్రహ్మోత్సవాలకు మహామ్మాయిదేవి ముస్తాబు