గురువుకు బాగా నచ్చిన రాశులివే.
1.jpeg)
ప్రస్తుతం వృషభ రాశిలో తనకెంతో ఇష్టమైన రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల గురు గ్రహం మరింత బలం పుంజుకోవడంతో పాటు మరింతగా శుభ యోగాలు కలగజేసే అవకాశం ఉంది. మే 25వ తేదీతో వృషభ రాశి నుంచి నిష్క్రమించి మిథున రాశిలో ప్రవేశించబోతున్న గురువు తాను చేయదలచుకున్న మేలంతా పూర్తి చేయడం జరగబోతోంది. ఈ రెండున్నర నెలల కాలంలో గురువు చాలావరకు రోహిణి నక్షత్రంలోనే సంచారం చేసే అవకాశం ఉంది. ఫలితంగా గురువు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారికి అనేక శుభ యోగాలు కలగజేయడం జరగబోతోంది.
మేషం: ఈ రాశికి అత్యంత శుభుడైన గురువు ప్రస్తుతం ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందడమే తప్ప తగ్గే అవకాశం ఉండదు. ఆదాయ ప్రయత్నాలను ఎంత ఎక్కువ చేస్తే అంతగా లాభం పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమై, కుటుంబంలో అన్యోన్యత, సామరస్యం బాగా వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి, గృహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మాటకు విలువ పెరుగుతుంది.క
ర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడికి అత్యంత ఇష్టమైన గురు గ్రహం ఈ రాశివారిని అనేక విధాలుగా ఉచ్ఛ స్థితికి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా వృద్ది చెందుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలుగుతాయి. విదేశాల్లో చదువులు, ఉద్యోగాలకు మార్గం సుగమం అవుతుంది. వారసత్వ సంపద, పిత్రార్జితం లభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
సింహం: రాశ్యధిపతి రవికి ప్రాణ స్నేహితుడైన గురువు ఈ రాశివారికి అత్యధికంగా ఆదాయ లాభం, అధికార లాభం అనుగ్రహించే అవకాశం ఉంది. ప్రస్తుతం గురువు ఈ రాశికి దశమ స్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగపరంగా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, జీతభత్యాలు పెరగడం, నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించడం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
వృశ్చికం: రాశ్యధిపతి కుజుడికి అత్యంత సన్నిహితుడైన గురువు ప్రస్తుతం సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ప్రేమ వ్యవహారాల్లో, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో స్థిరమైన జీవితం లభి స్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts

Latest News
