పాపన్నపేటలో ప్రభుత్వ పాఠశాలకు భూమి పూజ మెదక్,

సెప్టెంబర్06: (నమస్తే భరత్)
రాష్ట్రపతి అవార్డు గ్రహీత కీర్తిశేషులు మన్నే శ్వరయ్య,మన్నే శాంతమ్మ గార్ల జ్ఞాపకార్థం ఆయన కుమారుడు డాక్టర్ ఉపేందర్ మన్నె కోడలు వందన మన్నె ఆర్థిక సహకారంతో ఈ నిర్మితమవుతున్న
మెదక్ జిల్లా,పాపన్నపేట ప్రభుత్వ పాఠశాలకు ఆదివారం రోజు భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగం పేట్ నరేందర్ గౌడ్,మల్లoపేట మాజీ సర్పంచ్ బాపురెడ్డి, ఉపసర్పంచ్ సద్దాం,
మాజీ ఉపసర్పంచ్ ఖలీమ్,పాఠశాల చైర్మన్ శ్రీరాం భవాని,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యశోద,సిబ్బంది,నాల్గవ తరగతి ఉద్యోగులు
ఎల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులు జయవర్ధన్,శ్రీమన్నె ఈశ్వరయ్య,మన్నె శాంతమ్మ ట్రస్ట్ సభ్యులు
కైలాస రాజేశ్వర్ గుప్త,నాయకులు సుంకరి కిష్టయ్య ,ముశెట్టి కిష్టయ్య పూర్వ అధ్యాపకులు టప్ప రాములు గ్రామ ప్రజలు, ప్రముఖులు పాల్గొన్నారు.



