స్నేహితుడి కుటుంబానికి ఆపన్నహస్తం.. ఆర్థిక సహాయం అందజేత
నమస్తే భారత్ :-తొర్రూరు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 1999-2000 సంవత్సరం పదవ తరగతి పూర్వ స్నేహితులు ఇటీవల మండలంలోని మడిపల్లి గ్రామంలో మృతి చెందిన తోటి మిత్రుడు రమేష్ కుటుంబానికి ఆర్థికంగా చేయూతను అందించారు. ఇటీవల మడిపల్లి గ్రామంలో రమేష్ హత్యకు గురి కావడంతో అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మిత్రులు కలిసి రమేష్ కుటుంబ సభ్యులకు రూ. 41 వేల రూపాయలను అందజేశారు. ఆర్థిక సహాయం అందజేసిన మిత్రులకు రమేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.



