ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రపంచ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగ షాపూర్ నగర్ డివిజన్, రాజీవ్ గాంధీ నగర్ లోని...

ప్రపంచ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగ షాపూర్ నగర్ డివిజన్, రాజీవ్ గాంధీ నగర్ లోని గీతాంజలి హై స్కూల్ లో జరుపుకున్నారు.

📰 Generate e-Paper Clip

ప్రపంచ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగ షాపూర్ నగర్ డివిజన్, రాజీవ్ గాంధీ నగర్ లోని గీతాంజలి హై స్కూల్ లో జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రపంచ మానవ హక్కుల సంస్థ జాతీయ డైరెక్టర్ మధుబాబు మాట్లాడుతూ,1998లో రోమ్ స్టాట్యూట్ ఆమోదం పొందిన రోజు కావడంతో ఈ తేదీ ప్రాధాన్యం ఉంది.ఈ ఒప్పందం ద్వారా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు స్థాపించబడింది.
ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధ నేరాలు, జాతి నిర్మూలన, మానవత్వానికి వ్యతిరేక నేరాలు జరిగినప్పుడు బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈ న్యాయస్థానం పనిచేస్తుంది.
ఈ సంవత్సరం సందేశం: “సరిహద్దులకు అతీతమైన న్యాయం – జవాబుదారీతనాన్ని బలోపేతం చేస్తూ, మానవ గౌరవాన్ని పరిరక్షిద్దాం.” అని చెప్పారు.. పాఠశాల కరెస్పాండంట్ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ,

“న్యాయం ఉన్నచోటే శాంతి ఉంటుంది; శాంతి ఉన్నచోటే అభివృద్ధి ఉంటుంది.”అని అన్నారు. కార్యక్రమంలో స్కిలోక్క్రాట్ వెబ్ట్రైక్స్ సందీప్ బల్లెం, చైతన్య కుమార్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!