ePaper
Sunday, July 12, 2026
ePaper
Homeఎడిటోరియల్యూరియా యాప్ (ఫర్టిలైజర్ )ను వెంటనే తొలగించాలి

యూరియా యాప్ (ఫర్టిలైజర్ )ను వెంటనే తొలగించాలి

📰 Generate e-Paper Clip

యూరియా యాప్ (ఫర్టిలైజర్ )ను వెంటనే తొలగించాలి

సిపిఐ( ఎం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని స్థానిక ప్రజా సంఘాల భవనంలో సిపిఐ ఎం మండల కార్యదర్శి గుండ గాని మధు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా యూరియా ఫర్టిలైజర్ యాప్ అనేది రైతులకి మరణ శాపం గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకు రైతులకు ఇచ్చే రాయితీలు క్రమంగా తగ్గిస్తూ అనేక క్రిమిసంహారక మందులకు విపరీతమైన రేట్లు పెంచుతూ, క్రమక్రమంగా రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని, గత సంవత్సరానికి ఈ సంవత్సరం తో పోల్చుకుంటే ఎరువుల బస్తాలు ఒక్కొక్క బస్తా కి సుమారు 450 నుండి 550 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచి రైతులను విడిచింది అన్నారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ నుండి, గతంలో అనేక రకాల వ్యవసాయ పరికరాలు, అవి ఒక మాటలో చెప్పాలంటే, గడ్డపార నుండి ఇప్పుడున్న ట్రాక్టర్ వరకు, రాయితీల రూపంలో ఇచ్చేవారు కానీ ఇప్పుడు నా పరిస్థితిలో ఏ ఒక పనిముట్టు కూడా ఇచ్చే పరిస్థితిలో లేవన్నారు, గతంలో ఖరీఫ్ కాలంలో పచ్చిరొట్టేకూ సంబంధించి, జీలుగు పిల్లి పెసర, రైతులకు ఉచితంగా ప్రభుత్వాలే ఇచ్చేయమన్నారు కానీ ఇప్పుడు అవన్నీ పూర్తిగా బందు పెట్టారన్నారు, దీన్నిబట్టి చూస్తే
వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టే దిశగా.దీన్నిబట్టి చూస్తే వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు , అందులో భాగంగానే రైతులకు యూరియా యాప్ తీసుకురావడం జరిగిందని దీనివల్ల అనేక మంది రైతులు యూరియా ఇప్పుడు ఆన్లైన్లో వస్తుందో అని ఆందోళన చెందుతూ అర్థం కాని పరిస్థితిలో అయోమయంలో ఉన్నారన్నారు నూటికి 60 శాతం మంది రైతులు చదువు రాని వారు వారికి యాప్ ఎలా ఓపెన్ చేయాలి . ఎలా బుక్ చేసుకోవాలి అనేది అర్థం కాక సతమతమవుతున్నారన్నారు, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాస్పందించి యూరియాను తగిన మోతాదులో రైతులకు పూర్తిస్థాయిలో అందించాలని, కేంద్ర ప్రభుత్వం గతంలో వ్యవసాయని పూర్తిగా కార్పొరేట్ అన్న దిశలో అడుగులు వేస్తే ఢిల్లీ చుట్టూ ఉన్న రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు, 13 నెలలపాటు ఉద్యమం చేసి 700 మంది రైతుల ప్రాణాలు కోల్పోయిన రైతు చట్టాల వెనక్కి నెట్టేవరకు ఉద్యమం చేసే విజయం సాధించాలని గుర్తు చేశారు
రైతుల జోలికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తే బలమైన ప్రజా ఉద్యమం తప్పదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!