ఫీజు బకాయి బిజెపి లడాయి నిరాహార దీక్షలో పాల్గొన్న మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ మెదక్,
ఆగస్టు25(నమస్తే భారత్): భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తలపెట్టిన ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్ పాల్గొని సంఘీభావం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. దీక్షలో కిసాన్ మోర్చా కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో పాల్గొన్నట్లు ఆయన వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులకు బకాయిలు విడుదల చేయవలసిందిగా డిమాండ్ చేస్తు న్నామన్నారు.లేని ఎడల బిజెపి పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుందనీ ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కిసాన్ మోర్చా జిల్లా కమిటీ జనరల్ సెక్రటరీ ఆకుల ప్రభాకర్, శ్యామ్,రమేష్, ఉపాధ్యక్షుడు రాజు, శ్రీనివాస్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు చంద్రన,కార్తీక్ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు బాల్ లింగం,శ్రీకాంత్ మెదక్ పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు గోవిందరాజు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



