ePaper
Saturday, June 27, 2026
ePaper
Homeఎడిటోరియల్విద్యా సేవలకు ఘన నివాళి.. జీడిమెట్ల జీహెచ్ఎం సుధాకర్‌కు ఆత్మీయ వీడ్కోలు

విద్యా సేవలకు ఘన నివాళి.. జీడిమెట్ల జీహెచ్ఎం సుధాకర్‌కు ఆత్మీయ వీడ్కోలు

📰 Generate e-Paper Clip

విద్యా సేవలకు ఘన నివాళి.. జీడిమెట్ల జీహెచ్ఎం సుధాకర్‌కు ఆత్మీయ వీడ్కోలు
– పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం
– పూర్వ విద్యార్థుల భావోద్వేగ నివాళులు
– క్రమశిక్షణ, నిబద్ధతకు ప్రతీకగా కొనియాడిన వక్తలు
– విద్యార్థుల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన గురువు
– సహచర ఉపాధ్యాయులు, విద్యావేత్తల ప్రశంసలు
– ఆత్మీయ సమావేశం, విందుతో ముగిసిన కార్యక్రమం

పేట్ బషీరాబాద్, జూన్ 26 ( నమస్తే భరత్ ): ప్రభుత్వ విద్యా రంగంలో సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించిన జీడిమెట్ల జెడ్పీహెచ్ఎస్ గెజిటెడ్ హెడ్‌మాస్టర్ ఎస్. సుధాకర్ పదవీ విరమణ సందర్భంగా పాఠశాల ఆవరణలో శుక్రవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, విలువల ఆధారిత విద్యాబోధనలో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, సహచర ఉపాధ్యాయులు కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పాఠశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుధాకర్ విద్యా ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. ఆయన బోధన, పరిపాలనా దక్షత, విద్యార్థుల పట్ల చూపిన అంకితభావం అనేక మంది జీవితాలకు మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో సుధాకర్ విధులు నిర్వహించిన జెడ్పీహెచ్ఎస్ మూసాపేట్‌కు చెందిన 2010 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా హాజరై తమ గురువుకు ఘనంగా నివాళులర్పించారు. హైకోర్టు న్యాయవాది, విఐపీ మానవ హక్కుల సంఘం జాతీయ డైరెక్టర్ మహమ్మద్ జహంగీర్ (మున్నా), మల్లికార్జున్తో పాటు పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, తమ జీవితాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడంలో సుధాకర్ అందించిన మార్గదర్శకత్వం కీలక పాత్ర పోషించిందని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎం ఆనంద్ జోషి, ఎస్ఏ (గణితం) ఆర్. గోపాలకృష్ణన్, ఎస్ఏ (సాంఘిక శాస్త్రం) ఆర్. గోపాల్, ఎస్ఏ (భౌతిక శాస్త్రం) అనిల్, ఎస్ఏ (ఇంగ్లీష్) కె. దస్తయ్యతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ, సుధాకర్ క్రమశిక్షణ, నిజాయితీ, విద్యార్థుల పట్ల అంకితభావం ప్రతి ఉపాధ్యాయుడికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆయన పదవీ విరమణ విద్యాశాఖకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. అనంతరం సుధాకర్‌ను శాలువా, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఆపై ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం, విందు భోజనంతో కార్యక్రమం ముగిసింది. గురువు–విద్యార్థి అనుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ సన్మాన వేడుక హాజరైన ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!